Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కీరవాణి పాటకు కింగ్ నాగార్జున ఫిదా.. ట్వీట్ చేసి..
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.ఓ'. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ విలన్గా నటించడం విశేషం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఆడియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పోయి.
2.0 చిత్రంలోని 'బుల్లిగువ్వా..' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్గా ఉందంటూ ప్రశంసించారు.
I love this song from 2.0!! @mmkeeravaani singing was just brilliant👍👍👍and ofcourse @arrahman is a class apart🙏 👉 https://t.co/HeCvXiO6FT
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 12, 2018
నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 600 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూపొందించింది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకొన్నారు. ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా విడుదల చేస్తున్నారు.