Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కీరవాణి పాటకు కింగ్ నాగార్జున ఫిదా.. ట్వీట్ చేసి..
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.ఓ'. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ విలన్గా నటించడం విశేషం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఆడియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పోయి.
2.0 చిత్రంలోని 'బుల్లిగువ్వా..' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్గా ఉందంటూ ప్రశంసించారు.
I love this song from 2.0!! @mmkeeravaani singing was just brilliant👍👍👍and ofcourse @arrahman is a class apart🙏 👉 https://t.co/HeCvXiO6FT
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 12, 2018
నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 600 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూపొందించింది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకొన్నారు. ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా విడుదల చేస్తున్నారు.