Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎట్టకేలకు త్రివిక్రమ్ గురించి నాగార్జున.. ఎలా స్కిప్ చేశాడో చూడండి!
Recommended Video
అక్కినేని నాగార్జున తాజా సినిమా మన్మథుడు 2. గతంలో అనగా 2002 సంవత్సరంలో వచ్చిన మన్మథుడు సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా రూపొందించారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున ఇచ్చిన స్పీచ్ చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఓ ఇంట్వ్యూలో ఈ విషయమై నాగార్జున స్పందించిన తీరు మరోసారి ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి పోతే..
అప్పుడు విజయ్ భాస్కర్.. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్
అయితే అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాకు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఆ టైమ్ లో మన్మథుడు మూవీ తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూ సూపర్ డూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం మన్మథుడు 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాకపోతే ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.
షూటింగ్ జరుగుతుండగానే భారీ హైప్
మన్మథుడు 2 సెట్స్ పై ఉండగానే భారీ హైప్ నెలకొంది. టీజర్, ట్రైలర్ లలో నాగార్జున, రకుల్ రొమాన్స్ యూత్ ఆడియన్స్కి కిక్కివ్వగా.. చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. దీంతో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించి.. ఆ వేడుకకు మన్మథుడు డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ని గెస్ట్గా ఆహ్వానించారు. ఈ వేదికపై విజయ్ భాస్కర్ని పొగుడుతూ స్పీచ్ ఇచ్చిన నాగ్.. త్రివిక్రమ్ గురించి మాట్లాడలేదు.
త్రివిక్రమ్ని మరిచావా..? ముదిరిన చర్చలు
నాగార్జున వాయిస్ విన్న ఆడియన్స్, పలు డిజిటల్ మీడియా సంస్థలు త్రివిక్రమ్ని మరిచావా.. నాగ్? అంటూ వార్తలు రాశారు. ఎందుకంటే మన్మథుడు సినిమాలో పదునైన పంచ్ డైలాగ్స్ హైలైట్ అయ్యి సినిమాకు భారీ విజయం తెచ్చిపెట్టాయి కాబట్టి. ఆ డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి త్రివిక్రమ్ని నాగ్ ఎలా మరిచాడంటూ చర్చలు ముదిరాయి.
త్రివిక్రమ్ గురించి నాగార్జునకు ప్రశ్న
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకు ఇదే విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. త్రివిక్రమ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అని యాంకర్ వేసిన ప్రశ్నకు.. ''నాకు మన్మథుడు కథ చెప్పింది విజయ్ భాస్కర్ గారు. ఆయన రోజూ నన్ను కలిసి కథ గురించి చర్చించేవారు. అందులోని పంచ్ డైలాగులు చెప్పింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను.. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్'' అంటూ నాగార్జున రియాక్ట్ అయ్యాడు. అంటే త్రివిక్రమ్ గురించి ఇక్కడ కూడా మాట్లాడేందుకు ఇష్టపడలేదు నాగార్జున.
మన్మథుడు 2 మూవీ
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.