Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
నాకు 25 ..నాగ్ కి 15, నాగచైతన్యకు రెండే..ఎఎన్నార్
నా మనవడు నాగచైతన్య రెండు చిత్రాలతోనే నన్ను, నాగార్జునను అధిగమించాడు. నాకు గుర్తింపు రావడానికి 25 చిత్రాలు పడితే...మా అబ్బాయి నాగార్జునకు 15 సినిమాల తరువాత పేరొచ్చింది అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. అభినందన అక్కినేని చలనచిత్ర పురస్కారాలు 2010 మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా జరింగింది. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ తన మనవడు గురించి పై స్పందించారు. అలాగే సినిమా విజయంలో నిర్మాతే కీలకమన్నారు. చిత్రానికి తల్లి, తండ్రి అతడేనన్నారు.
అనతరం ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ...నాగచైతన్య మంచి ప్రతిభ కనబర్చాడని, నెంబర్ వన్ స్థానానికి ఎదిగేందుకు కృషిచేయాలని సూచించారు. తర్వాత నాగచైతన్య మాట్లాడుతూ..అభిమానుల ప్రోత్సాహంతో మరింత శ్రమించి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తానని అన్నారు. ఇక ఉత్తమ ప్రేమకథా చిత్రంగా ఎంపికైన ఏమాయ చేశావే హీరో, హీరోయిన్స్ నాగచైతన్య, సమంతలను ఈ సందర్భంగా అక్కినేని, మూవీ మొఘల్ రామానాయుడు సత్కరించారు. వీరితో పాటు ప్రతిభ కనబరిచిన నటుడు కృష్ణుడు, పాటల రచయిత అనంతశ్రీరామ్, మాటల రచయిత అనురాధలకు కూడా అవార్డులను ప్రదానం చేశారు.