Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూ. కోటి విరాళం ప్రకటించిన మరో మనసున్న స్టార్
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంపాదనలో మాత్రమే కాదు.... సహాయం చేయడంలోనూ తాను స్టారే అని నిరూపించుకున్నాడు. భారీ వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరంలోని బాధితుల కోసం ఆయన రూ. 1 కోటి విరాళం అందించారు. చెన్నై బాధితులకు సహాయం చేయడంలో ముందున్న భూమిక ట్రస్ట్ కు ఆయన రూ. 1 కోటి విరాళం అందించారు.
చెన్నై నగరంపై విరుచుకుపడ్డ ప్రకృతి విళయం చూసి షాకైన అక్షయ్ కుమార్.... సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తనకు సన్నిహితుడైన సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్కు కాల్ చేసాడు. ఆయన ఈ వ్యవహారం విషయంలో నటి సుహాసిని మణిరత్నంను సంప్రదించాలని సూచించారు.
సుహాసిని మణిరత్నం సలహా మేరకు ‘భూమిక ట్రస్ట్'కు రూ. 1 కోటి సహాయం అందించారు. చెన్నైలో ప్రకృతి విలయం సంప్రదించిన మరుసటి రోజు నుండి ఈ ట్రస్ట్ వరద బాధితులకు ఆహారం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. అక్షయ్ కుమార్ పంపిన చెక్కును సుహాసిన మణిరత్నం... భూమిక ట్రస్ట్ మేజింగ్ ట్రస్టీ జయేంద్రకు అందజేసారు.