Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డిస్నీ+హాట్స్టార్కు అక్షయ్ షాక్.. థియేటర్లలో పేలనున్న లక్ష్మీబాంబు.. రిలీజ్ ఎప్పుడంటే
కరోనా లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల కార్యక్రమాలు స్తంభించాయి. సినిమాల రిలీజ్ నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే జూలై, సెప్టెంబర్ మాసంలో థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతాయని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో పలు భారీ చిత్రాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే థియేటర్ల ఓపెన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలనే శుభవార్త వినే అవకాశం కనిపిస్తున్నాయి. అందుకు అక్షయ్ కుమార్ ఇస్తున్న సంకేతాలే కారణంగా కనిపిస్తున్నాయి.
Recommended Video
లాక్డౌన్లో ఓటీటీ రిలీజ్ కోసం
దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడటంతో పలు బాలీవుడ్ చిత్రాలను అమెజాన్, డిస్నీ+హాట్స్టార్, ఇతర ఓటీటీ ఫ్లాట్ఫాంపై రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో లూట్ కేస్, సడక్ 2 లాంటి చిత్రాలు ఓటీటీ ఫ్లాట్ఫాం మీద రిలీజ్ అయ్యాయి. అయితే అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీబాంబ్ చిత్రం కూడా ఓటీటీపై రిలీజ్ కావాల్సింది. అయితే లక్ష్మీబాంబు ఓటీటీ నుంచి రిలీజ్ చేసే నిర్ణయాన్ని మార్చుకోవడం ఇప్పుడు వైరల్గా మారింది.
సెప్టెంబర్ 9న అక్షయ్ పుట్టిన రోజున
ముందస్తు ప్లాన్ ప్రకారం.. లక్ష్మీబాంబు చిత్రాన్ని అక్షయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా అంటే సెప్టెంబర్ 9వ తేదీన డీస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా ఆ సినిమాను డిస్నీ నుంచి తీసేయడం, రిలీజ్ను వాయిదా వేయడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
ట్విట్టర్లో ట్రెండింగ్ ఎందుకంటే..
ఇదిలా ఉండగా, లక్ష్మీబాంబు చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లోనే రిలీజ్ చేయాలని ప్రస్తుతం ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్టోబర్లో సినిమా థియేటర్లను రిలీజ్ చేయాలని కేంద్రం యోచిస్తున్న సమయంలో లక్ష్మీబాంబును ఓటీటీ నుంచి తప్పించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దీపావళీ పండుగ కానుకగా నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్టు సమాచారం. దీంతో లక్ష్మీబాంబు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్నది.
కాంచన చిత్రానికి రీమేక్గా
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన లక్ష్మీబాంబ్ చిత్రానికి లారెన్స్ రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలో రిలీజైన కాంచన చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 22న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది.