Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దారుణం: సగం సినిమా లీక్ చేసారు, సెకండాఫ్ మొత్తం నెట్ లోనే
అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ’ విడుదలకు ముందే లీక్ కావడంతో సినిమా యూనిట్ సభ్యులు షాక్ కు గురయ్యారు.
లేకేజ్ నిన్నా మొన్నటి వరకూ పైరసీ అన్న పీడ ఒక్కటే అనుకుంటే ఇప్పుదు అదే భూతం మరో అడుగు ముందుకేసి అసలు అటు సినిమా పూర్తి కాకుండానే ఎప్పటికప్పుడు పుటేజ్ ని లేక్ చేసేస్తోంది. అదీ ఏ చిన్నా చితకా సినిమాలకో కాదు. అగ్ర హీరోలకూ ఈ బెడద తప్పటం లేదు.
టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ' స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే లీక్ కావడంతో సినిమా యూనిట్ సభ్యులు షాక్ కు గురయ్యారు. సినిమాకు సంబంధించిన సెకండ్ హాఫ్ మొత్తం లీక్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రెమో డిసౌజా ధ్రువీకరించాడు.
Recommended Video
పెన్ డ్రైవ్ల్లో ఎక్కించుకుంటున్నారు
ఎలా లీకైంది ఏంటన్న వివరాలు తెలియవు కానీ.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మూడు వారాల ముందే బయటికి వచ్చేసిందన్న సమాచారం దర్శకుడు రెమో డిసౌజాకు తెలిసింది. అతను చేస్తున్న ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో కొందరు యువకులు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' సినిమా గురించి డిస్కస్ చేస్తుండటం.. ల్యాప్ టాప్ లోంచి ఒక్కొక్కరుగా సినిమాను పెన్ డ్రైవ్ల్లో ఎక్కించుకుంటుండటం గమనించిన డిసౌజా వెంటనే చిత్ర బృందానికి దీనిపై సమాచారం అందించాడు.
అభిమానులు ఆందోళన చెందొద్దని
ఆ వెంటనే టీమ్ జాగ్రత్తల్లో మునిగి పోయింది. ఇప్పటికిప్పుడు నెట్ లో ఉన్న అన్ని లింకులూ తీసేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. పైరసీని అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అభిమానులు ఆందోళన చెందొద్దని.. పైరసీకి సంబంధించి ఏ సమాచారం ఉన్నా చెప్పాలని సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్ పిలుపునిచ్చాడు.
ప్రధాని మోదీ
ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి అవసరమనే సందేశాన్ని ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా పట్ల ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ విడుదలకు ముందే సినిమా లీక్ కావడం దర్శకనిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తోంది. గతం లో మన తెలుగులో అత్తారింటికి దారేది సగానికి పైగా.., ఆ తర్వాత ఒక తమిళ సినిమా పూర్తిగా విడుదలకు ముందే ఆన్ లైన్ లో వచ్చేసాయి...