Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హిడింబి దేవాలయాన్ని సందర్శించి పాపులర్ చేసిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా హిడింబి దేవాలయాన్ని దర్శించి వచ్చారు. తన తాజా చిత్రం యాక్షన్ రీప్లే రిలీజైన సందర్భంగా సక్సెస్ కావాలంటూ ఆయన దేవాలయాలు సందర్శిస్తున్నారు. అందులో భాగంగా హిడింబి దేవాలయ్యాన్ని దర్శించారు. భారతంలోని భీముని భార్యగా చెప్పబడుతున్న హిడింబికి గుడి ఉండటం విచిత్రమే అయినా అది హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతంలో ఉంది. ఆమె కుమారుడు ఘతోత్కచుడు టైటిల్ తో తెలుగులో ఓ చిత్రం వచ్చింది. అలాగే పాత మాయాబజార్ చిత్రంలో హిడింబి పాత్ర(సూర్యకాంతం) ఉంటుంది. అలాగే ఆమె కుమారుడు ఘతోత్కచుడుగా ఎస్.వి.రంగారావు వేసారు. ఇక అక్షయ్ కుమార్ ఈ గుడి గురించి తెలుసుకుని ప్రత్యేకంగా వెళ్ళటంతో ఈ గుడి ఇప్పుడు అంతటా తెలిసింది. పాండవులు వనవాసం చేసారని చెప్తున్న ఆ ప్రాంతానికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇక దీపావళి రోజు అక్షయ్ కుమార్ తాజా చిత్రం యాక్షన్ రీప్లే రిలీజ్ అయింది. అయితే భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రం ముందు రిలీజైన కట్టా మీటా కూడా ప్లాప్ అయింది. సింగ్ ఈజ్ కింగ్ చిత్రం తర్వాత అక్షయ్ ఒక్క హిట్టూ తెచ్చుకోలకపోయారు.