Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హిడింబి దేవాలయాన్ని సందర్శించి పాపులర్ చేసిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా హిడింబి దేవాలయాన్ని దర్శించి వచ్చారు. తన తాజా చిత్రం యాక్షన్ రీప్లే రిలీజైన సందర్భంగా సక్సెస్ కావాలంటూ ఆయన దేవాలయాలు సందర్శిస్తున్నారు. అందులో భాగంగా హిడింబి దేవాలయ్యాన్ని దర్శించారు. భారతంలోని భీముని భార్యగా చెప్పబడుతున్న హిడింబికి గుడి ఉండటం విచిత్రమే అయినా అది హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతంలో ఉంది. ఆమె కుమారుడు ఘతోత్కచుడు టైటిల్ తో తెలుగులో ఓ చిత్రం వచ్చింది. అలాగే పాత మాయాబజార్ చిత్రంలో హిడింబి పాత్ర(సూర్యకాంతం) ఉంటుంది. అలాగే ఆమె కుమారుడు ఘతోత్కచుడుగా ఎస్.వి.రంగారావు వేసారు. ఇక అక్షయ్ కుమార్ ఈ గుడి గురించి తెలుసుకుని ప్రత్యేకంగా వెళ్ళటంతో ఈ గుడి ఇప్పుడు అంతటా తెలిసింది. పాండవులు వనవాసం చేసారని చెప్తున్న ఆ ప్రాంతానికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇక దీపావళి రోజు అక్షయ్ కుమార్ తాజా చిత్రం యాక్షన్ రీప్లే రిలీజ్ అయింది. అయితే భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రం ముందు రిలీజైన కట్టా మీటా కూడా ప్లాప్ అయింది. సింగ్ ఈజ్ కింగ్ చిత్రం తర్వాత అక్షయ్ ఒక్క హిట్టూ తెచ్చుకోలకపోయారు.