Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
డ్రగ్స్ కేసు డీల్ చేసిన ఆఫీసర్ రంగంలోకి దిగాడు.. సినిమా హాల్స్ ఆటలు ఇక సాగవు!
గత ఏడాది వెలుగు చూసిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసుని ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ ఈ కేసుని డీల్ చేశారు. ఈ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న సెలెబ్రిటీలందరిని అకున్ సబర్వాల్ విచారణ జరిగిపిన సంగతి తెలిసిందే. తాజగా అకున్ సబర్వాల్ మరో బాధ్యతని స్వీకరించారు. సినిమా థియేటర్స్, మల్టి ఫ్లెక్స్ లలో విక్రయించే ఆహార పదార్థాలని అధిక ధరలకు అమ్ముకుంటున్న సంగతి తెలిసిందే.
అకున్ సబర్వాల్ ఈ అక్రమాలపై తాజగా ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ పరిధిలోని ప్రముఖ థియేటర్స్, మల్టి ఫ్లెక్స్ లలో ఆయన దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు 100 వరకు కేసులు నమోదయ్యాయి. ఎంఆర్పీ ధరకు మించి ఒక్కరూపాయి అధికంగా వాసులు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
హైదరాబాద్ లోని జివికె వన్, ప్రసాద్ ఐమాక్స్, కార్నివాల్ అమీర్ పేట్, పివిఆర్ పంజా గుట్ట వంటి ప్రధాన మల్టి ప్లెక్స్ లలో తనిఖీలు నిర్వహించారు. సినిమా థియేటర్ యాజమాన్యాలు మోసాలు చేసినా, అధిక ధరలకు విక్రయించినా ప్రజలు 7330774444 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అకున్ సబర్వాల్ కోరారు.