నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి: అలా..మొదలైంది నందినీరెడ్డి
'ఈ చిత్రం కథ తయారుచేసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు జరిగిన విషయాలన్నీ తలచుకుంటే ఈ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ ఎమోషన్ ల్ అయింది నందినీరెడ్డి.నాని, నిత్యామీనన్ జంటగా రంజిత్ మూవీస్ పతాకంపై బి.నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన 'అలా.. మొదలైంది" చిత్రం వందరోజుల వేడుకను జరుపుకుంది. హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది.అలాగే..
ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం కల్యాణిమాలిక్, నాని. వీరిద్దరూ నాకు ఇచ్చిన సహకారంతో నేను ఈ విజయాన్ని సాధించగలిగాను. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఏ సీన్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. నన్ను నమ్మి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతను అప్పచెప్పిన దాముకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాన్ని నిజమైన వందరోజుల పండుగ దాకా ఆదరించిన ప్రేక్షకులందరికీ సర్వదా కృతజ్ఞురాలినని తెలిపింది.


Click it and Unblock the Notifications











