Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సరిగ్గా వాడుకోవాలని నందినిరెడ్డికి ఉచిత సలహాలు!
హైదరాబాద్: 'అలా మొదలైంది' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందినీరెడ్డి. నందినీరెడ్డి త్వరలో 'అలా మొదలైంది' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.
ఇప్పటికే ఓ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఆమెను సంప్రదించడం, బాలీవుడ్లో ఆ చిత్రాన్ని రీమేక్ చేయడానికి నందినీరెడ్డి అంగీకరించడం కూడా జరిగి పోయింది. నందినీరెడ్డికి బాలీవుడ్ అవకాశం వచ్చిందని తెలియగానే పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పట్టారట.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లి నిలదొక్కుకున్న మహిళా దర్శకులు చాలా అరుదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు చిత్ర సీమకు పేరు తేవాలని పలువురు సూచిస్తున్నారు.
అక్కడ ఓ పెద్ద నిర్మాణ సంస్ధతో కలిసి దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒరిజనల్ లో నటించిన నిత్యా మీనన్ కూడా ఈ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. హీరోగా ఓ కొత్త కుర్రాడు నటించే అవాశమున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు హిట్ అయితే హిందీలో వరస సినిమాలు చేయాలనే ఆలోచనలో నందినీ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీకి తగినట్లు చిన్న చిన్న మార్పులతో ఈ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.