Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అక్కినేని బుడ్డోడు అఖిల్ పరువు పోయినట్లయింది!
హైదరాబాద్ : ఇప్పుడు అందరీ దృష్టీ నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ఎంట్రీ చిత్రంపై ఉంది. ఏ తరహా చిత్రం చేయబోతున్నాడు...ఏ దర్శకుడు డైరక్ట్ చేస్తాడు..అతని సరసన చేసే హీరోయిన్ ఎవరూ..బ్యానర్ ఏది అనే అంశాలపై ఓ రేంజిలో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం...అఖిల్ తొలి చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించనున్నారు. గతంలో ఆయన బ్యానర్ పై లాంచ్ అయిన హీరోలంతా నెంబర్ వన్ పొజీషన్ లో ఉండటంతో సెంటిమెంటు పరంగా కలిసొస్తుందని ఈ నిర్ణయం నాగార్జున తీసుకున్నారని తెలుస్తోంది.
కాగా...అఖిల్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కుర్ర హీరోయిన్ అలియా భట్ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అలియా స్పందించారు. అసలు అక్కినేని అఖిల్ ఎవరో కూడా నాకు తెలియదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. మ్మ. ఇలాంటి పుకార్లతో తన పేరును జోడించద్దని మీడియాని కోరింది అలియా భట్. పాపం అఖిల్ సరసన అలియా అనే వార్తలు ఎలా మొదలయ్యాయో తెలియదు కానీ...అలియా స్టేట్మెంట్తో అఖిల్ పరువు పోయినట్లయింది.
కాగా...ఇటీవల విడుదలైన 'మనం'లో తళుక్కున మెరిశాడు అఖిల్. ఆయన తెరపై కనిపించిన విధానం అభిమానులకే కాకుండా పరిశ్రమను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ కథానాయకుడు మహేష్బాబు సైతం భవిష్యత్లో ఓ మంచి స్టార్గా అవతరిస్తాడని అఖిల్ని మెచ్చుకొన్నారు. తాజాగా అఖిల్ కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోయే సినిమాకి సంబంధించి ప్రయత్నాలు వూపందుకొన్నట్టు తెలుస్తోంది. అఖిల్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారు.'తాను ఎలాంటి కథలో నటిస్తే బాగుంటుందో సలహా ఇవ్వండ'ని ట్వీట్ చేసి అడిగారు. రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తే బాగుంటుందని కొందరంటే, యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పటికే అఖిల్ రెండు మూడు కథల్ని ఎంపిక చేసుకొన్నారని సమాచారం.