Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'పంజా' నిర్మాత నెక్ట్స్ చిత్రం విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో 'పంజా' చిత్రం రూపొందించిన నీలిమా తిరుమలశెట్టి తన తదుపరి చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తోంది. 'అలియాస్ జానకి' టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం జూలై 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
నిర్మాత మాట్లాడుతూ "పంజా సినిమా తర్వాత ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. కానీ నేను ఈ సినిమా చేయడానికి పవన్కల్యాణ్ కారణం. కొత్త ప్రతిభను ప్రోత్సహించమన్నారు. అందుకే ఈ సినిమా చేశాను. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది'' అని అన్నారు. మంచి సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు.
హీరో మాట్లాడుతూ "అలియాస్ జానకి కథకాదు. ఇన్సిడెంట్లా ఉంటుంది. రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా. సాంకేతికంగా అందర్నీ మెప్పిస్తుంది'' అని అన్నారు.
వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'అలియాస్ జానకి'. సంఘమిత్ర ఆర్ట్స్ నిర్మిస్తోంది. తారా అరుళ్రాజ్ సమర్పకుడు. నీలిమ తిరుమలశెట్టి నిర్మాత. దయా.కె. దర్శకుడు.
నాగబాబు, తనికెళ్ల భరణి, శివ నారాయణ, భరణి శంకర్, శత్రు, వంశీ రెడ్డి, రమేష్ వేంపల్లి, మీనా కుమారి తదితరులు ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్: హరి వర్మ, నృత్యాలు: దయా.కె, వంశీ కాట్రోజు, యాక్షన్: దయా.కె., సుజిత్ సారంగ్, మాటలు: వంశీ కృష్ణ గద్వాల, వశిష్ట శర్మ, అర్జున్, సుమన్ చిక్కల, స్క్రీన్ప్లే-దర్శకత్వం: దయా.కె., సహ నిర్మాత: విక్రమ్.ఎస్