Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి, సుకుమార్ నుంచి 'అర్జున్ రెడ్డి' సందీప్ వరకు.. క్రేజీ డైరెక్టర్స్ అందరూ అతడి ఇంట్లో!
Recommended Video
ఈ మధ్య కాలంలో గమనిస్తే టాలీవుడ్ నుంచి ప్రతిభ గల దర్శకులు బయటకు వస్తున్నారు. అద్భుతమైన చిత్రాలు తీస్తూ టాలీవుడ్ స్థాయి పెంచుతున్నారు. ఆల్రెడీ అగ్రదర్శకుడైన రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన సంగతి తెలిసిందే. సుకుమార్, కొరటాల శివ లాంటి దర్శకులు కూడా భారీ చిత్రాలతో విజయాలు అందుకుంటున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో యువ దర్శకుడు సందీప్ రెడ్డి సంచలనం సృష్టించారు. ఇలాంటి దర్శకులంతా ఒకే చోటికి చేరితే ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ క్రేజీ దర్శకులంతా వంశీ పైడిపల్లి ఇంటికి డిన్నర్ కు వెళ్లారు.
వంశీ పైడిపల్లి ఇంట్లో విందు
ఊపిరి లాంటి చిత్రంతో తన సత్తా చాటుకున్న వంశీ పైడిపల్లి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. గత రాత్రి వంశీ పైడిపల్లి తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, నాగ అశ్విన్, క్రిష్ హాజరయ్యారు.
అందరూ క్రేజీ దర్శకులే
వంశీ
పైడిపల్లి
ఇంట్లో
విందుకు
హాజరైన
దర్శకులంతా
టాలీవుడ్
లో
జోరుమీద
ఉన్న
దర్శకులే
కావడం
విశేషం,
సుకుమార్
రంగస్థలం
చిత్రంతో,
కొరటాల
భరత్
అనే
నేనుతో,
నాగ
అశ్విన్
మహానటి
చిత్రంతో
ఘనవిజయాలు
సొంతం
చేసుకున్నారు.
భారీ చిత్రాలు వారి చేతిలో
మిగిలిన దర్శకులలో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ చేతిలో కూడా భారీ చిత్రాలు ఉన్నాయి.
|
కారణం అదేనా
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోయే సూపర్ స్టార్ మహేష్ 25 వ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఆ సంతోషంలోనే సహచర దర్శకులకు వంశీ విందు ఏర్పాటు చేసి ఉంటాడని భావిస్తున్నారు. విందుకు హాజరైన దర్శకులందరికి వంశీ కృతజ్ఞతలు తెలియజేశాడు.