Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’ హీరోయిన్ ఈమే
హైదరాబాద్ : గబ్బర్ సింగ్ చిత్రంలో సూపర్ హిట్ ఐటం సాంగ్ టైటిల్ గా 'కెవ్వు కేక' అనే చిత్రం అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేవీప్రసాద్ దర్శకత్వంలో జాహ్నవీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ హీరోయిన్ షర్మిల మాండ్రే ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె కన్నడంలో నవగ్రహ, సజ్ని,కృష్ణ అనే చిత్రాలలో నటించింది. తమిళంలోనూ రీసెంట్ గా మిరట్టల్ అనే చిత్రం చేసింది. తెలుగులోనూ మంచి బ్రేక్ వస్తుందని ఆమె భావిస్తోంది.
అల్లరి నరేష్ మాట్లాడుతూ దేవీ, సతీష్ తన కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయని, అలాగే ఈ చిత్రం కూడా కామెడీ కేక పుట్టించేలా విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. హాస్యనటులందరూ కలిసిన కామెడీ క్లబ్లా ఈ చిత్రం వుంటుందని, మేక తోకను వూపాలి కానీ తోక మేకను వూపకూడదని, అలాగే పీకలో నుంచి కేక రావాలని, అలాంటి కెవ్వు కేక పెట్టించే చిత్రమిదని దర్శకుడు దేవీప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని కులుమనాలి చిత్రం నిర్మించిన బొప్పన చంద్రశేఖర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయ్కుమార్, సంగీతం: రాజ్-శివ, బీమ్స్, చిన్నిచరణ్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్.
మరో ప్రక్క అల్లరి నరేష్, రిచా పనయ్ జంటగా నటిస్తున్న చిత్రం 'యముడికి మొగుడు'. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. చంటి అడ్డాల నిర్మాత. ఈ నెల 7 నుంచి స్విట్జర్లాండ్లో ఒక పాటను తెరకెక్కిస్తారు. ప్రేమ్రక్షిత్ నృత్యరీతులు సమకూరుస్తారు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ ''యమధర్మరాజు కూతురితో ప్రేమాయణం సాగించిన ఓ అల్లరి కుర్రాడి కథ ఇది. చిలిపి పనులతో హాయిగా కాలం వెళ్లదీసే ఓ కుర్రాడు ఉన్నట్టుండి యమపురికి ఎందుకు చేరుకొన్నాడనే విషయం తెరపైనే చూడాలి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. పతాక సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి''అన్నారు.
''కథాబలమున్న చిత్రమిది. నరేష్ శైలి హాస్యం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. రామోజీ ఫిల్మ్సిటీలో తెరకెక్కించిన సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తాం. నవంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత. రమ్యకృష్ణ, సాయాజీషిండే, గిరిబాబు, కృష్ణభగవాన్, రఘుబాబు, చలపతిరావు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, సంగీతం: కోటి.