Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
పాపులర్ అవుదామనే పవన్ పై సెటైర్ (వీడియో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ని ఏదో విధంగా వాడేద్దామనే ఆలోచన ఫిల్మ్ మేకర్స్ లో బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పవన్ చెప్పిన డైలాగుల్లో పాపులర్ అయిన వాటిని ప్యారెడీ చేసి క్రేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అత్తారింటికి దారేది లో డైలాగు అయిన నేను సింహం లాంటోండిని అంటూ చెప్పే డైలాగును అల్లరి నరేష్ ప్యారెడీ చేసి,సెటైర్ వేసారు. ఆయన తాజా చిత్రం జంప్ జిలానిలో ఈ డైలాగు ఉండనుంది. ఇంతకీ ఆ డైలాగు ఏమిటీ అంటే...ఈ టీజర్ చూడండి..
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/yyhgDDga1JI" frameborder="0" allowfullscreen></iframe></center>
అల్లరి నరేష్ ద్విపాత్రాభినయంలో రూపొందిన చిత్రం 'జంప్ జిలాని'. ఈ సినిమా ప్రచార చిత్రం రీసెంట్ గా విడుదలైంది. చిత్రంలో స్వాతి దీక్షిత్, ఇషా చావ్లా హీరోయిన్స్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించారు. అంబికా రాజా నిర్మాత. అంబికా కృష్ణ సమర్పకులు. తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు' చిత్రానికిది రీమేక్.
వారిద్దరూ కవల పిల్లలు. ఒకడికి ఐదు వందలిస్తే గంటలో వెయ్యి రూపాయలు చేస్తాడు. మరొకడికి వెయ్యి రూపాయిలిస్తే పది నిమిషాల్లో పది పైసలు కూడా లేకుండా చేస్తాడు. ఇలాంటి వారిపై తాతముత్తాతల ఆస్తుల్ని అభివృద్ధి చేసే బాధ్యత వచ్చి పడింది. మరి దీన్ని వారు సక్రమంగా చేయగలిగారా లేదా అనేది మా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు అల్లరి నరేష్.
దర్శకుడు మాట్లాడుతూ ''ఈ చిత్రంలో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి. అందుకే సినిమాకు 'జంప్ జిలాని' అనే పేరు పెట్టాం. ఇప్పటిదాకా తెరపై ఒక్క అల్లరి నరేష్ను చూస్తేనే నవ్వుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు కనిపించబోతున్నారు. ఇక థియేటర్లలో నవ్వుల వర్షం కురుస్తుంది'' అన్నారు.
''కలగలప్పు' సినిమాను ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మార్చి తీశాం. దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ నెల 26న పాటల్ని, వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత.
ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: విజయ్ ఎబెంజర్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, కళ: కిరణ్కుమార్, కూర్పు: గౌతంరాజు.