Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూర్య, కార్తిలతో పాటే అంటున్న తెలుగు హీరో
సూర్య, కార్తి అని తమిళ హీరోలు ఇక్కడి మార్కెట్ను సొంతం చేసుకున్నప్పుడు మనం మన మార్కెట్ను విస్తరించుకుంటే తప్పేముంది? అందుకే ఇకపై ఏడాదికి నాలుగైదు తెలుగు చిత్రాలు, ఒకటి రెండు తమిళ సినిమాలు చేయాలనుకుంటున్నాను. 'పోరాళి' చేస్తుండగానే మరో ఏడెనిమిది మంది తమిళ నిర్మాతలు అవకాశాలతో కలవడం ఆశ్చర్యమనిపించింది.'' అంటున్నారు అల్లరి నరేష్. ఆయన తన తాజా చిత్రం మడతకాజా విడుదల సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే తన తమిళ చిత్రం గురించి చెబుతూ..."తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో 'పోరాళి' చేస్తున్నాను. అక్కడ నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులోకి అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నా చిత్రాల బడ్జెట్ రూ. 5.5 - 6 కోట్లు ఉంటుంది. అదే తమిళ మార్కెట్ జత చేరితే నిర్మాతకు రూ.కోటి లాభముంటుంది అన్నారు.
ఇక తాను చేయబోయే తదుపరి చిత్రాలు గురించి చెబూతూ...నారాయణ దర్శకత్వంలో శర్వానంద్, శ్రియ, నేను కలిసి చేసే సినిమా త్వరలో ఉంటుంది. భీమినేని దర్శకత్వంలో ఓ చిత్రం దసరాకు మొదలవుతుంది. దేవిప్రసాద్, చందు, సత్తిబాబు చిత్రాలున్నాయి. ఇవిగాక మరో పెద్ద చిత్రముంది. త్వరలో ప్రకటిస్తాను అన్నారు. మడతకాజా గురించి చెబుతూ.."సీమటపాకాయ్లో లాగా ఈ చిత్రంలోనూ సెంటిమెంట్ ఉంటుంది. కవిత, నేను కలిసి చేసిన సెంటిమెంట్ సీన్లు హృద్యంగా ఉంటాయి. ఏ ఆర్టిస్టుకైనా కామెడీ చేయడం చాలా కష్టం. సినిమాను ప్రేమించే వారెవరూ కామెడీ నచ్చదని చెప్పరు. అక్షయ్కుమార్ లాంటి యాక్షన్ హీరోలు కూడా కామెడీతో స్టార్డమ్ను సొంతం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కామెడీ చేసే హీరోలు సెంటిమెంట్ సీన్లు చేస్తే ప్రేక్షకులు వెంటనే ఒప్పుకుంటారు. 'గమ్యం'లో గాలిశీను పాత్ర కూడా అందుకే చాలా త్వరగా ఎక్కింది అన్నారు.