Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ లెటెస్ట్ ఇన్ఫో..
హైదరాబాద్ : అల్లరి నరేష్, రీచా పనయ్ జంటగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న భారీ వినోదాత్మక చిత్రం 'యముడికి మొగుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. నరేష్, ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చిన డాన్సర్లపై ఓ పాటను గురువారం నుంచి చిత్రీకరిస్తున్నారు.
తను ఇంత వరకూ పోషించని ఓ కొత్త గెటప్తో నరేష్ పాల్గొంటున్న ఈ పాట కోసం ఓ ఆడిటోరియం సెట్ను భారీ స్థాయిలో నిర్మించారు. చిత్రం పోగ్రెస్ గురించి నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ..ఈ రోజు ప్రారంభించిన ఈ పాట 13వ తేదీన పూర్తవుతుంది. నిక్సన్ నృత్య దర్శకత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నాం. దీని తరువాత మరో పాటని విదేశాల్లో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. గత నెల్లో పాలకొల్లు, పరిసరన ప్రాంతాల్లో 15 రోజుల పాటు చిత్రీకరించిన ఓ పాట, కీలక సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఈ నెలలోనే ఆడియోను, విజయదశమికి సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు.
'యముడికి మొగుడు' అనే టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, నరేష్ కెరీర్లోనే భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉంటుందని ఆయన అన్నారు. దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ 'మా కథకు తగిన టైటిల్ యముడికి మొగుడు. హీరో, యముడు పాత్రల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు చాలా కొత్తగా ఉండటమే కాకుండా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే 'అల్లుడా..మజాకా' చిత్రంలోని 'అత్తో..అత్తమ్మ కూతురో' పాటను రీమిక్స్ చేసి నరేష్, రమ్యకృష్ణ, రీచా పనయ్పై చిత్రీకరించారం. ఇది సినిమాకి హైలెట్ అవుతుంది. అలాగే యముడికి కొడుకుగా భరత్ పాల్గొన్న సన్నివేశాలు కూడా కడుపుబ్బా నవ్విస్తాయి' అని తెలిపారు.
నరేష్, రీచా పనయ్, రమ్య కృష్ణ, షాయాజీ షిండే, సీనియర్ నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, కృష్ణ భగవాన్, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన ఈ చిత్ర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మూలకథ : జయసిద్ధు, మాటలు : క్రాంతి సకినాల, పాటలు : రామ జోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, సంగీతం : కోటి, ఫోటోగ్రఫీ : కె. రవీంద్రబాబు, ఎడిటింగ్ : గౌతం రాజు, కళ : కిరణ్ కుమార్, సమర్పణ : ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత : చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఇ. సత్తిబాబు.