twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే 'మనసారా' చిత్రాన్ని మీడియాను దూరం పెట్టాం

    By Srikanya
    |

    'మంచి సినిమా తీశారనిపించు కోవాలనే ముందుగా మీడియాకు తెలియజేయ లేదు. విక్రమ్‌ నా కుమారుడు. హీరోగా పరిచయం చేస్తూ యాక్షన్‌ సినిమా తీయమని సలహా ఇచ్చారు. అభినయంపరంగానే సినిమా ఉండాలని ఇలా తీశాం. సినిమాను చక్కటి విజయాన్ని చేకూర్చినందుకు ధన్యవాదాలు' అని నిర్మాత ప్రకాష్‌బాబు మీడియాకు తెలియచేసారు.రవిబాబు దర్శకత్వంలో మూవింగ్‌ ఇమేజ్‌ పతాకంపై ప్రకాష్‌బాబు నిర్మించిన చిత్రం మనసారా. విక్రమ్‌, దివ్య జంటగా నటించారు. సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రకాష్‌ మీడియాతో స్పందించారు.

    అనంతరం దర్శకుడు అల్లరి రవిబాబు మాట్లాడుతూ...'పాటల రికార్డింగ్‌ మే 10న చేశాం. ఒక్కోపాటను ఒకనెల కంపోజ్‌ చేశారు. పాటలు ఖచ్చితంగా విజయవంతమవుతాయని చెప్పాను. సినిమా పూర్తయ్యాక సినిమా బాగా తీశావని అన్నారు. అదే గొప్ప ప్రశంస. ఆడియోతోపాటు సినిమానూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా'నని అన్నారు.

    హీరో విక్రమ్‌ మాట్లాడుతూ...'సినిమాకు రవిబాబు వెన్నెముకలాంటివారు. కథ విన్నప్పుడు భయమేసింది. తెరవెనుక చాలామంది కధానాయకులు ఉన్నారు. తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తే బాగుంటుందనే ఒప్పుకున్నా. మంచి సంగీతాన్ని అందించారు. భాస్కరభట్ల మంచి సాహిత్యాన్ని అందించారు. మరో పాటను అనంత్‌ శ్రీరామ్‌ రాశారు. తొలిప్రయత్నాన్ని సక్సెస్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నా'నని అన్నారు.

    మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ...'ఇది మెలోడియస్‌ మ్యూజిక్‌ అని రవిగారికి ఎప్పుడో చెప్పాను. ఇది ట్రమెండస్‌ హిట్‌. రవిబాబు చక్కగా తీర్చిదిద్దాడు. మంచి క్వాలిటీ గల సినిమా ఇది' అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X