Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దాడి దారుణం, ఒకేసారి ఆపలేం : అల్లు అరవింద్
డబ్బింగ్ సీరియళ్లను క్రమేణా ఆపుతామని ముందే చెప్పామని, ఒకేసారి ఆపితే చానల్ దెబ్బతింటుందని, చానల్ పై ఆధారపడ్డ 300 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని అల్లు అరవింద్ చెప్పారు. క్రమేణా ఆపుతామని చెప్పినా దాడి చేయడం దారుణం అన్నారు.
అయితే టీవీ ఆర్టిస్టులంతా ఈ దాడి చేసారని భావించడం లేదు, తెర వెనక ఉండి ఎవరో దుండగులు ఈ దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యల వల్ల సమస్యలు పరిష్కారం కావదని అల్లు అరవింద్ పేర్కొన్నారు. శాంతియుతంగా ఉంటేనే అందరికీ మంచిదన్నారు.
దాడి వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్లోని మాటీవీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళన కారులు డబ్బింగ్ సీరియళ్లను నిలిపి వేయాలంటూ దాడికి పూనుకున్నారు. మాటీవీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కార్యాలయంలో అద్దాలతో పాటు, ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనలో కొందరు మాటీవీ సిబ్బంది కూడా గాయపడ్డట్లు సమాచారం. కార్యాలయం ఆవరణలో నిలిచి ఉన్న కార్ల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆందోళన కారులు రెండు కార్లలో వచ్చి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.