twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలజ్ఞానంలో పీఆర్పీ..అల్లు

    By Staff
    |

    Allu Aravind
    బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రజారాజ్యం ఆవిర్భావం గురించి ఉందని, తమ పార్టీ అదికారాన్ని చేపట్టి ప్రజల మన్ననలు పొందేలా పరిపాలన సాగిస్తుందని పేర్కొన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ తెలిపారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలదండ వేసి పై విధంగా చెప్పారు అరవింద్. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది ఇప్పటివరకూ ఏదీ జరగకుండా ఉండలేదని, అలాగే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావటం ముమ్మాటికి ఖాయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అలాగే మైనార్టీలను ఆనాడే బ్రహ్మంగారు చేరదీసి సర్వమత సమానత్వాన్ని ప్రభోదించారన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X