Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పాండీ బజార్లో దాసరి నాకు క్లాస్ పీకారు.. అల్లు అరవింద్
Recommended Video
దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రూపొందించిన 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిష్యులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు పలువురు రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం రూపొందింది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. దాసరితో నాకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. చెన్నైలోని పాండిబజార్లో ఓ సారి దాసరికి కనిపించాను. అప్పుడు నాతో నీవు నిర్మాతగా మారు. మీ నాన్న చెబితే సినిమా తీయనని చెప్పావటగా అని అన్నారు. ఆ తర్వాత దాసరి ఇచ్చిన సలహాలు, సూచనలతో తొలిసారి నిర్మాతగా మారి ఆయనతో సినిమా తీశాను. మా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఆయనే తొలి దర్శకుడు అని అల్లు అరవింద్ అన్నారు.