Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రతి నిర్మాతా గుర్తించి, పాఠాలు నేర్చుకోవాలి: అల్లు అరవింద్
మూడు రోజుల క్రితం మృతి చెందిన సీనియర్ నిర్మాత కె.దేవీవరప్రసాద్ అంత్య దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన విషయాన్ని సంతాప సభలో సీనియర్ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ గుర్తు చేసారు. తన కెరీర్లో తొంభై శాతం విజయాలు సాధించిన నిర్మాత పరిస్థితి ఇలా దారుణంగా మారిన సంగతిని ప్రతి నిర్మాతా గుర్తించి, పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు తమకు 'పర్యవేక్షక కమిటీ' వేస్తే బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిర్మాతలంతా ఈ 'పర్యవేక్షక కమిటీ' కి నిబద్ధులై సినిమాలు తీయాల్సి ఉంటుంది. సినిమా నిర్మాణ వ్యయం దగ్గర నుంచి, తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, తారల కాల్షీట్లు, షూటింగ్ పని దినాల వరకు అన్ని విషయాలూ ఈ కమిటీ పర్యవేక్షణలో ఉంటాయని తెలుస్తోంది. దీనివల్ల నిర్మాణ వ్యయం, పారితోషికాలు అదుపులోకి వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.
అలాగే అంతర్గత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. పరిశ్రమలో అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నది నిర్మాతేనని, అంతర్గత క్రమశిక్షణ లోపించడమే దీనికి కారణమని చాలామంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ క్రమశిక్షణ పాటిస్తేనే కష్టాలు చాలా వరకు తీరుతాయని వారు భావిస్తున్నారు.