Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాని సినిమాపై కన్నేసిన అల్లు అరవింద్.. కుదరదంటున్న దిల్ రాజు!
ప్రస్తుతం OTT రంగం డామినేషన్ ఎక్కువవ్వడంతో సినిమా థియేటర్స్ పరిస్థితి భయానకంగా మారుతోంది. భవిష్యత్తులో థియేటర్స్ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉండవచ్చని ఇప్పటికే చాలా మంది గ్రహించారు. ఇక ఓటీటీల కాలమే నడుస్తుందని కూడా వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అందుకే ముందు జాగ్రత్తగా అల్లు అరవింద్ ఆహా యాప్ ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
కానీ ఆ యాప్ కి ఇంకా సరైన క్రేజ్ రాకపోవడంతో పెద్ద సినిమాలు అందులో రిలీజ్ అయితే బావుంటుందని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీ బిజినెస్ లో నిలదొక్కుకోవాలి అంటే కాస్త పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకే నాని సినిమాపై కన్నేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా రూపొందిన V సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఇవ్వాలని అల్లు అరవింద్ ఇటీవల చర్చలు జరిపాడట.
కానీ దిల్ రాజు అందుకు ఎంతమాత్రం ఒప్పుకోవడం లేదు. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పటికే ఆలస్యం కావడం వలన ఓటీటీ రిలీజ్ చేస్తే బావుంటుందని అల్లు అరవింద్, దిల్ రాజుకి మంచి ఆఫర్ కూడా ఇచ్చాడట. సినిమా బడ్జెట్ కంటే ఆ ఆఫర్ కాస్త ఎక్కువేనట. కానీ దిల్ రాజు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మరి అల్లు అరవింద్ ఇంకా ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి మరి.