Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
వాళ్ళే వారధులు.. గౌరవించుకోవడం మా విధి.. ఆ రోజులు పోయాయి: అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ హిట్ సాధించడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్న ఆయన డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తోంది. ఈ మేరకు గ్రాండ్ సెక్సెస్ మీట్ నిర్వహించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని గౌరవించుకోవడం మా విధి. నేను 'విజేత' సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్దపెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇలా ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ ఇచ్చారు. 'అల వైకుంఠపురములో' చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేశారు.