Don't Miss!
- News రిజల్ట్ తరువాత సీఎం కుర్చీ హుష్ కాకి, హైకమాండ్ వెయిటింగ్, గాలి జనార్దన్ రెడ్డి సంచలనం
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వాళ్ళే వారధులు.. గౌరవించుకోవడం మా విధి.. ఆ రోజులు పోయాయి: అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ హిట్ సాధించడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్న ఆయన డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తోంది. ఈ మేరకు గ్రాండ్ సెక్సెస్ మీట్ నిర్వహించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని గౌరవించుకోవడం మా విధి. నేను 'విజేత' సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్దపెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇలా ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ ఇచ్చారు. 'అల వైకుంఠపురములో' చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేశారు.