Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టైలిష్ స్టార్ హిట్ లెక్కలు తేల్చేందుకు సుకుమార్.. బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్
రంగస్థలం లాంటి సినిమాను తెరకెక్కించిన సుకుమార్.. మళ్లీ మరో ప్రాజెక్ట్ను చేత బట్టలేదు. మధ్యలో ఏవేవో వినిపించినా.. ఏదీ ఫైనల్ కాలేదు. చివరకు తనకు ఇష్టమైన, కలిసొచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా ఓకే అయింది. ఆ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ను ప్రకటించారు మేకర్స్.
నా పేరు సూర్య తరువాత గ్యాప్..
ఎన్నో అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం నా పేరు సూర్య. ఈ మూవీ బన్నీ తెగ కష్టపడ్డాడు. బాడీ లాంగ్వేజ్, మేకోవర్ ఇలా ప్రతీది ఎంతో శ్రద్ద తీసుకుని చేస్తే.. ఫలితం బెడిసికొట్టింది. ఈ దెబ్బకు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నాడు. ఏ సినిమాను ఎంచుకోవాలే తెలీక కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
వరుస బెట్టి ప్రాజెక్ట్లకు ఓకే..
చాలా గ్యాప్ రావడంతో తన ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేందుకు ఫిక్స్ అయిన బన్నీ ఒకేసారి మూడు ప్రాజెక్ట్లకు ఓకే చెప్పాడు. త్రివిక్రమ్తో అలవైకుంఠపురములో, సుకుమార్తో మరో సినిమాను, వేణు శ్రీరామ్తో ఐకాన్ అనే చిత్రాలను ఓకే చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే అందులో మొదటగా త్రివిక్రమ్ సినిమాను బన్నీ మొదలెట్టేశాడు.
సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న అలవైకుంఠపురములో..
సినిమా విడుదల కాకముందే పాటలతోనే సోషల్ మీడియాను ఊపేస్తోన్న అల్లు అర్జున్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సామజవరగమన, రాములో రాముల అంటూ యూట్యూబ్ను షేక్ చేసేస్తున్నాడు. తెలుగు పాటల్లో అత్యధిక మంది లైక్ చేసిన సాంగ్గా సామజవరగమన నిలిచి కొంగొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.
|
బన్నీ, సుకుమార్ కాంబినేషన్పై అప్డేట్..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే ఉండే క్రేజే వేరు. ఆర్య, ఆర్య2 చిత్రాల్లో వీరి మ్యాజిక్ కనిపిస్తూ ఉంటుంది. మరోసారి వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అసలే లెక్కల మాష్టారు రంగస్థలం ఇచ్చిన ఊపు మీదుండటంతో రాబోయే మూవీపైనా అంతులేని అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మైత్రీ మూవీస్ అధినేతలు. రేపు (అక్టోబర్ 30) ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముహుర్తాన్ని (ఉదయం 9.36 నిమిషాలకు ) ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రష్మీక మందాన్నను హీరోయిన్గా ఎంపిక చేశారు.