అల్లు అర్జున్, అనుష్క...నా జీవితాన్ని మార్చారు
హైదరాబాద్: రచయిత నుండి నటుడిగా మారిన పోసాని కృష్ణ మురళి మురళి....‘నాయక్' సినిమా తర్వాత చాలా బిజీ అయ్యారు. నాయక్ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర జనాలకు బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాత విడుదలైన తర్వాత ఆయనకు నాలుగు రోజుల్లో 36 సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయట. నటన విషయంలో తన జీవితంలో ఇంత మార్పు రావడానికి కారణం ఎవరంటే...అల్లు అర్జున్, అనుష్క పేరు చెబుతున్నాడు పోసాని.
మీడియాతో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ...‘వేదం సినిమా నా కెరీర్లో టర్నింగ్ పాయింట్., ఈ సినిమా తర్వాత నాకు కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా అవకాశాలు వచ్చాయి. నటనను సీరియస్గా తీసుకోవాలని వేదం సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్, అనుష్క నన్ను ఎంకరేజ్ చేసారు' అని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు.

తాజాగా విడుదలైన ‘పవర్' చిత్రంలో కమెడియన్గా ప్రేక్షకులను మెప్పించిన పోసాని....త్వరలో విడుదల కానున్న మహేష్ బాబు ‘ఆగడు' చిత్రంలోనూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ చిత్రంలో కూడా పోసాని మంచి పాత్ర దక్కించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











