twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పరుగు' పెట్టిస్తున్న అల్లు అర్జన్

    By Staff
    |

    అల్లు అర్జున్ 'పరుగు' సినిమా విడుదలయి సంవత్సరం దాటిపోయింది. ఆ తర్వాత ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆర్య-2' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇకపై అంత గ్యాప్ రాకూడదనుకున్న అల్లు అర్జున్ వరుస సినిమాలతో తన కెరీర్ ను పరుగు పెట్టిస్తున్నాడు.

    ప్రస్తుతం 'ఆర్య-2', గమ్యం ఫేం క్రిష్ రూపొందిస్తున్న 'వేదం', గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా వున్న అల్లు అర్జన్ హీరోగా మరో చిత్రం మొదలు కాబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు. 'బదరీనాథ్' గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'నరసింహ నాయుడు', 'ఇంద్ర', 'గంగోత్రి' చిత్రాలకు కథ అందించిన చిన్ని కృష్ణ కథను అందించారు. ఓ గుడి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతోందని సమాచారం. అల్లు అర్జున్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో 'బన్నీ' తర్వాత వస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు వున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X