Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Allu Arjun: న్యూయార్క్లో అల్లు అర్జున్కు అరుదైన గౌరవం.. తగ్గేదే లే అంటూ డైలాగ్
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సుకుమార్ డైరెక్షన్లో నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తగ్దేది లే.. అనుకుంటూ పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా అల్లు అర్జున్కు ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. పుష్ప చూసిన నార్త్ ప్రేక్షకులు బన్నీ డైలాగ్స్, నటన, డ్యాన్స్కు ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ మేకవర్, యాటిట్యూడ్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్కు ఓ అరుదైన గౌరవం దక్కింది.
పుష్పతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పరేడ్కు బన్నీ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ పరేడ్కు అల్లు అర్జున్ నాయకత్వం వహించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
75వ భారత స్వాతంత్య దినోత్సవ వేడుకలలో భాగంగా న్యూయార్క్లో ఇండియా డే పరేడ్ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఎంతో కలర్ఫుల్గా నిర్వహించింది. ఆగస్టు 21న జరిగిన ఈ గ్రాండ్ ఇండియా పరేడ్కు అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్గా హాజరయ్యారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో నిర్వహంచిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పరేడ్లో సుమారు 5 లక్షల మందికి భారతీయులు పాల్గొన్నారు. వీరంతా జాతీయ జెండాలను ఒకేసారి ప్రదర్శించడంతో ఒక రికార్డ్ను సాధించారు.
ఈ వేడుకలో అత్యధిక మంది ప్రవాస భారతీయులు సమిష్టిగా డ్రమ్స్ వాయించడం ద్వారా మరో వరల్డ్ రికార్డును సృష్టించారు. పుష్పతో ఇండియా వైడ్గా పాపులారిటీ సాధించిన అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్గా రావడంతో న్యూయార్క్ వీధులు ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయాయి.
అయితే ప్రతీ ఏటా న్యూయార్క్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే పరేడ్ రోజున న్యూయార్క్ వీధులన్నీ భారత దేశ త్రివర్ణపతాకం శోభితంగా మారతాయి.
ఈసారి 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరింత జోష్తో కలర్ఫుల్గా ఇండియా పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్కు గ్రాండ్ మార్షల్గా వ్యవహరించిన అల్లు అర్జున్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ 'యే భారత్కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ' (ఇది భారతదేశ త్రివర్ణ పతాకం.. తగ్గేదేలే..) అంటూ పుష్ప డైలాగ్తో జోష్ నింపాడు.
అలాగే భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు అల్లు అర్జున్ తెలిపాడు. ఇక గ్రాండ్ మార్షల్గా వ్యవహిరించిన బన్నీకి అక్కడి మేయర్ ఆమమ్స్ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా పాల్గొంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.