Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మీలో బద్రినాథ్...మిర్చిలో బద్రినాథ్’ రేడియోమిర్చిలో తిష్టవేసిన బన్నీ...!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..రేడియో మిర్చిలో సందడి చేశారు. తన తాజా చిత్రం బద్రినాథ్ సాధించిన ఘనవిజయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. 'బద్రినాథ్" చిత్రానికి సంబంధించి రేడియో మిర్చి ఓ కాంటెస్ట్ నిర్వహించింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నవారు సినిమాకి సంబంధించిన టైటిల్ ట్రాక్ కు 4లైన్లు లిరిక్ రాయాలి. అలాగే సినిమా పాట కూడా పాడాలి. రేడియో మిర్చి నిర్వహించిన ఈ కాంటెస్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో 5గురు విజేతలుగా ఎంపికయ్యారు. ఈ 5గురికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసే అవకాశం కల్పించింది రేడియో మిర్చి. ఈ విజేతలను కలుసుకున్న అల్లు అర్జున్ వీరితో సరదాగా కబుర్లు చెప్పాడు..
విజేతలందరూ అల్లు అర్జున్ ని కలిసినందకు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ 'అందరూ ఈ సినిమాని చూడాలి. ఓ యువకుడి భక్తి, ప్రేమ ప్రయాణం ఈ సినిమా. ఉత్తమ విలువలతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అందుకే అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు" అని చెప్పాడు. తన ప్లాప్ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలనే తపనతో హీరో అల్లు అర్జున్ రేడియో మిర్చిలో తిష్టవేసుకుని కూర్చుని తనదైన స్టయిల్ లో 'బద్రినాథ్"కు పబ్లిసిటీ ఇచ్చారు.