Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..డిటేల్స్
వరసగా తెలుగు హీరోలంతా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూండటంతో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అక్కడ తను అడుగుపెట్టాలనుకుంటున్నాడు. అందుకు ఆర్య 2 సబ్జెక్టుని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రాన్ని ఆల్రెడీ యూ టి.వి మోషన్ పిక్చర్స్ వారు చూసి ఓకే చేసారు. దాంతో ఆర్య2 బాలీవుడ్ లో రీమేక్ గా వెళ్లనుంది. సుకుమార్ డైరక్షన్ లోనే ఈ హిందీ సినిమా కూడా రూపుదిద్దుకోబోతుంది.ఇక ఇప్పటికే రానా తన దమ్ మారో దమ్, డిపార్టమెంట్ చిత్రాలతో తన సత్తా చూపటానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కమిటయ్యారు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.
అలాగే తాజాగా అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన పరుగు చిత్రం వచ్చి యావరేజ్ అయ్యింది. అయినా అదే దర్శకుడుకి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా భాస్కర్ కలిసి ఓ స్టోరి లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు. నిజానికి కార్తితో భాస్కర్ ఆ చిత్రం చేయాలని ప్లాన్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.నవంబర్ మొదటి వారం నుంచి త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుంది. ఇక ఈ చిత్రాలతో పాటు దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే చేసాడు. ఇక నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రీసెంట్ గా ....ఎన్టీఆర్ తో ఊసరవిల్లి చిత్రం నిర్మించారు.