Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..డిటేల్స్
వరసగా తెలుగు హీరోలంతా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూండటంతో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అక్కడ తను అడుగుపెట్టాలనుకుంటున్నాడు. అందుకు ఆర్య 2 సబ్జెక్టుని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రాన్ని ఆల్రెడీ యూ టి.వి మోషన్ పిక్చర్స్ వారు చూసి ఓకే చేసారు. దాంతో ఆర్య2 బాలీవుడ్ లో రీమేక్ గా వెళ్లనుంది. సుకుమార్ డైరక్షన్ లోనే ఈ హిందీ సినిమా కూడా రూపుదిద్దుకోబోతుంది.ఇక ఇప్పటికే రానా తన దమ్ మారో దమ్, డిపార్టమెంట్ చిత్రాలతో తన సత్తా చూపటానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కమిటయ్యారు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.
అలాగే తాజాగా అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన పరుగు చిత్రం వచ్చి యావరేజ్ అయ్యింది. అయినా అదే దర్శకుడుకి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా భాస్కర్ కలిసి ఓ స్టోరి లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు. నిజానికి కార్తితో భాస్కర్ ఆ చిత్రం చేయాలని ప్లాన్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.నవంబర్ మొదటి వారం నుంచి త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుంది. ఇక ఈ చిత్రాలతో పాటు దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే చేసాడు. ఇక నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రీసెంట్ గా ....ఎన్టీఆర్ తో ఊసరవిల్లి చిత్రం నిర్మించారు.