Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరీనా మజాకా! ఆగలేక పోతున్న అల్లు అర్జున్
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక్కసారి కథ చెబితే చాలు ఎంత పెద్ద టాప్ హీరో అయినా ఒకే దెబ్బకు ఓకే అనాల్సిందే. రెండో సారి పూరితో సినిమా చేసే హీరోలు ఆయనపై నమ్మకంతో కథ వినకుండానే ఓకే చెప్పేస్తారు. ఆ రేంజిలో ఉంటుంది హీరోలకు పూరీ స్టోరీ వివరించే తీరు. ఒక్కసారి పూరి ఒక కథ పట్టుకుని హీరో దగ్గరి వెళ్లాడంటే ఓకే కావాల్సిందే. ఎందుకంటే ఏ హీరో ఇమేజ్కు తగిన విధంగా ఆ సబ్జెక్టును రెడీ చేసుకోవడం పూరి స్టైల్. హిట్టా? ప్లాపా? అనేది వేరే విషయం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ చిత్రం తర్వాత బన్నీతో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేయబోతున్నాడు. ఇటీవల పూరి బన్నీకి కథ వివరించగా చాలా ఎగ్జైట్ అయ్యాడని, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
పూరీ జగన్నాధ్, అల్లు అర్జున్ కలయికలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో...'. గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. దర్శకుడు పూరీ జగన్నాధ్ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్లో చేస్తున్న చిత్రం. రొమాంటిక్ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, కథ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: పూరీ జగన్నాధ్.