Don't Miss!
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'బద్రినాథ్' టాక్ అందుకే తేడా వచ్చింది...అల్లు అర్జున్ వివరణ
"ముందు ఈ సినిమా ఫలితం గురించి పలు రకాలుగా మాట్లాడుకొన్నారు. అంచనాలు పెంచుకొని రావడమే అందుకు కారణం కావచ్చు. అయితే ఇప్పుడొస్తున్న వసూళ్లు చూస్తుంటే సంతృప్తిగా ఉంది" అంటూ అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'బద్రినాథ్' గురించి చెప్పుకొచ్చారు. అలాగే తమిళంలో విడుదల చేయాలనుకోవటానకి కారణం చెప్తూ...''తమిళంలోనూ మార్కెట్ని విస్తరించాలనే ఆలోచన ఉంది. దాని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. సినిమా పెట్టుబడి పెంచాల్సిన విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పైగా పారితోషికం కూడా ఎక్కువే వస్తుందని అన్నారు.
అలాగే మగధీర ప్రభావం తెలుగు సినీ పరిశ్రమ మీద చాలా ఉంది. డబ్బు ఖర్చుపెడితే... తిరిగి సంపాదించుకోవచ్చు అనే ధీమా ఇచ్చింది ఆ సినిమానే. బద్రినాథ్ చేస్తున్నప్పుడు మా మదిలో కూడా అదే మెదిలింది. అంటే... అలాంటి సినిమా తీయాలని కాదు. ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకాన్ని పెంచుకొన్నాం. ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఓ సినిమాలో మేళవిస్తే పెట్టుబడి తిరిగి రావడానికి ఢోకా ఉండదు అని తెల్చి చెప్పారు.