Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గణపతి బప్పా మోరియా అంటూ బన్నీ దంపతుల సందడి.. అల్లు అరవింద్, సురేఖ కూడా హాజరై!
వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతీ ఏడాది దేశమంతా ఓ సందడి వాతావరణం నెలకొంటుంది. సాధారణ ప్రజలు మొదలుకొని సినీ, రాజకీయ ప్రముఖులంతా ఈ వేడుకల్లో భాగమై వినాయకుడికి సేవ చేస్తారు. ఊరూరా, వాడ వాడ ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలతో కళకళలాడుతూ ఉంటుంది దేశం. అయితే ఈ వినాయక చవితి సందర్బంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెగ సందడి చేశారు. ఆ వివరాలు చూద్దామా..
గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయకుడు
వినాయక చవితి సందర్బంగా గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయకుడిని ప్రతిష్టించారు. ఆ వినాయకుడికి 5 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేశారు గీతా ఆర్ట్స్ ఆఫీసు సిబ్బంది. ఈ వేడుకకు భార్య స్నేహా రెడ్డితో సహా విచ్చేసిన అల్లు అర్జున్ తెగ సందడి చేశారు. గణనాథుడికి వీడ్కోలు చెబుతూ ప్రత్యేక పూజలు చేశారు.
ఆఫీస్ స్టాఫ్ సమక్షంలో వైభవంగా
గీతా ఆర్ట్స్ ఆఫీస్ స్టాఫ్ సమక్షంలో వైభవంగా వినాయక నిమజ్జన వేడుక జరిగింది. ఈ వేడుకలకు బన్నీ తండ్రి అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు, చిరంజీవి భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కావడం జరిగింది. వినాయకుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డును, తీర్థ ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకుంటూ బన్నీ కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేశారు. దీంతో అక్కడి వాతావరణం సందడి సందడిగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ పిక్స్.. బన్నీ ఫ్యామిలీని చూసి
భార్య స్నేహారెడ్డి సహా బన్నీ ఫ్యామిలీ అంతా ఎంతో ఆనందంతో జరుపుకున్న ఈ వేడుకకు సంబందించిన పిక్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్ వీటిపై లైకులు కురిపిస్తూ తెగ షేర్ చేసుకుంటున్నారు.
బన్నీ.. అల వైకుంఠపురములో
ప్రస్తుతం అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. టబు కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.