Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
అల్లు అర్జున్ ఫ్యామిలీ పార్టీ...(ఫోటో)
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్-నీలిమ దంపుతలు, అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు శిరీష్ పాలు పంచుకున్నారు. తమ సొంత సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కు సంబంధించిన పనుల బిజీలో అల్లు వెంకటేష్, సినిమాల బిజీ కారణంగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు ఈ మధ్య కలిసి ఆనందగా గడిపిన క్షణాలు తక్కవే. ఈ నేపథ్యంలో నిన్న అంతా కలిసి ఫ్యామిలీ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటో తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా రిలీజ్ చేసాడు బన్నీ.
ఇక అల్లు అర్జున్ సినిమాల వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈచిత్రం బ్యాంకాక్లో షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ 30 రోజుల్లో థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ నెల రోజుల పాటు థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు.
ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ స్పెయిన్లో ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడకుండా బన్నీ ఇమేజ్ కు తగిన విధంగా స్టైలిష్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీనీ లవర్ బాయ్లా చూపెట్టబోతున్నాడు దర్శకుడు పూరి. ఇందులో అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
అల్లు శిరీష్ త్వరలో 'గౌరవం' చిత్రం ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజ్ 'ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్' పతాకంపై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈచిత్రం ఒకే సారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ నటిస్తోంది. మార్చి నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.