Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి అల్లు అర్జున్ విరాళం
హైదరాబాద్: స్టార్ హీరో అల్లు అర్జున్ హుదుద్ తుపాను బాధితుల కోసం మరోసారి విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5లక్షల విరాళం ప్రకటించారు. ఇంతకుముందు అల్లు అర్జున్ రూ.20లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలసిందే.
ప్రస్తుతం...
మొదటి నుంచీ అల్లు అర్జున్.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి చేయటంతో అతని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.
తెలుగుజాతి పౌరుషానికీ, కాకతీయ వీరత్వానికీ ప్రతీక గోనగన్నారెడ్డి. ఆ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరు మా చిత్రానికే ప్రధాన ఆకర్షణ అంటున్నారు గుణశేఖర్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డి తొలి రూపు (ఫస్ట్లుక్)ను చిత్రబృందం విడుదల చేసింది. గుణశేఖర్ మాట్లాడుతూ ''యువత, మాస్ను ఆకట్టుకొనే పాత్రలో బన్నీ కనిపిస్తాడు. గోనగన్నారెడ్డిగా ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది.
45 రోజుల పాటు బన్నీపై సన్నివేశాలు తెరకెక్కించాం. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రూపొందించిన పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ''న్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, కృష్ణంరాజు, నిత్యమీనన్, కేథరిన్, ఆదిత్యమీనన్, అజయ్, జయప్రకాష్రెడ్డి తదితరులు నటించారు. కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: రాగిణీ గుణ
కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న హీరో అతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.
ఎన్టీఆర్కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్ నటిస్తుంది'' అంటూ గుణశేఖర్ చెప్తున్నారు.