Don't Miss!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నా గుండె పగిలిపోయింది: అభిమాని మరణంపై అల్లు అర్జున్ ఆవేదన!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన అభిమాని దేవసాయి గణేష్ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వినగానే స్టైలిష్ స్టార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గణేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
'సాయి గణేశ్ మృతి వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి' అని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. పలువురు బన్నీ అభిమానులు అనకాపల్లి చేరుకుని గణేష్ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.
అనకాపల్లికి చెందిన 10వ తరగతి కుర్రాడు దేవసాయి గణేష్ అల్లు అర్జున్కు వీరాభిమాని. కొంత కాలంగా గణేష్ బోన్ క్యాన్సర్తో బాధ పడుతున్నాడు. తన అభిమాన నటున్ని చూడాలని, కలవాలని దేవసాయి గణేష్ కోరడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ ద్వారా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు.
తన అభిమాని గణేష్ కోరికపై వెంటనే స్పందించిన స్టైలిష్ స్టార్ ఇటీవల అనకాపల్లి వెళ్లి గణేష్ను కలిసిశారు. త్వరలోనే కోలుకుంటావని దైర్యం చెప్పారు. అతడి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసేందుకు కూడా బన్నీ ముందుకొచ్చారు. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో బన్నీ విచారం వ్యక్తం చేశారు.