'ఇద్దరమ్మాయిలతో' లో అదిరే బన్ని యాక్షన్ (కొత్త ఫోటోలు)
హైదరాబాద్ : దేశముదురు తర్వాత బన్నీ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్.లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై బన్ని అభిమానుల్లోనే కాక మిగతా వారిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని మరింత పెంచుతూ...రిలీజైన ట్రైలర్ ఆదరణ పొందింది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్,గెటప్స్ దగ్గరనుంచి విభిన్నత చూపించాడనే వార్త ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేస్తోంది.
ఈ నేఫధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో విడుదల అయ్యి ఓ రేంజిలో సర్కులేట్ అవుతున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వీటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం రిలీజ్ టైమ్ దగ్గరపడటంతో యాక్షన్ స్టిల్స్ కొన్ని విడుదల చేసారు.

సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే.... ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్.

'ఇడియట్', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఐటం బాంబ్ గా..బాలీవుడ్ నటి దేవషి కందూరిని ఎంపిక చేసారు. ఆమెపై స్పెషల్ గా రీసెంట్ గా స్పెయిన్ లో ఓ పాటను చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని చెప్తున్నారు.

ఈ చిత్రం మళయాళంలోనూ మంచి బిజినెస్ చేసింది. ఒకేసారి అక్కడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మళయాళ ట్రైలర్ కూడా అక్కడ దుమ్ము రేపుతోంది. అల్లు అర్జున్ గత చిత్రాలు కేరళలో బాగా ఆడటం తో ఈ చిత్రం బిజినెస్ కు మంచి క్రేజ్ వచ్చింది.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...చాలా కాలం తరవాత పూరి ఓ ప్రేమకథ తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రేమాయణాన్ని చూపించే విధానం అందర్నీ అలరిస్తుంది అన్నారు.

అల్లు అర్జున్ నటన, ఆయన కాస్ట్యూమ్స్ కొత్తగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్కి మంచి స్పందన వచ్చింది. నెట్లో లక్షల మంది చూశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి .

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.

స్పెయిన్ దేశంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు.

ఇప్పటివరకూ అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ గా ఉంటూ వచ్చారు. తొలిసారిగా అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేస్తూండటం కూడా హైలెటే.

థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.

ఈ చిత్రం గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..అల్లరి... ఆలోచన - ఆ అబ్బాయి ప్రత్యేకతలు. దుమ్ము రేపే జోరుంది. నిజం మాట్లాడతాడు. నిక్కచ్చిగా ఉంటాడు. అతని ఫిలాసఫీ కూడా కొత్తగా ఉంటుంది.

'చుట్టూ ఎవరూ లేనప్పుడు నువ్వేంటో.. అదే నువ్వు..' అంటూ మా హీరో ...హితోపదేశం చేస్తాడు. అతను ఇద్దరమ్మాయిలతో సాగించిన ప్రయాణం ఎలాంటిదో మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు పూరి జగన్నాథ్.

చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లోచాలా అంచనాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా రీచ్ అవుతామని బన్ని చెప్తున్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











