twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ లేటెస్ట్ ఇన్ఫో

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌లో ఇటీవలే పస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 8 నుంచి స్పెయిన్ లో ప్రారంభం కానుంది.

    ఈ మేరకు అల్లు అర్జున్, పూరి జగన్నాథ్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ రోజే స్పెయిన్ బయల్దేరి వెళ్లారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ తొలిసారిగా ఈచిత్రంలో శరీరంపై టాటూలు వేసుకుని కనిపించనున్నాడు.

    'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్.

    అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

    English summary
    Allu Arjun is leaving for Spain today for the next schedule of Iddarammayilatho. Shooting starts from 8th, major portion of the movie will be shot there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X