twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్-కాజల్ ఎవడు సెట్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి జోడీగా మరో గెస్ట్ రోల్‌లో కనపడబోతోంది హీరోయిన్ కాజల్. ఆర్య-2 తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి రామ్ చరణ్ 'ఎవడు' కోసం కలిసి పని చేస్తున్నారు.

    ఇటీవల ఈ ఇద్దరు స్టార్లపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. వీరు దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఎవడు సెట్స్‌లో ఉన్నప్పటి ఫోటో ఒకటి బయటకు లీకైంది. ఆ ఫోటోను ఇక్కడ వీక్షించవచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్-కాజల్ 15 నిమిషాల పాటు కనిపించనున్నారని, సినిమా క్లైమాక్స్‌కి వీరు కీలకం అని యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న టాక్.

    ఎవడు సినిమా వివరాల్లోకి వెళితే...వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన శృతిహాసన్, అమి జాక్సన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న సినిమా ఆడియో విడుదల చేసి జూన్ 14 సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

    ఈ చిత్రంలో ఇంకా జయసుధ, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథా సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్: సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

    English summary
    Yevadu movie directed by Vamsi Paidipally, the movie features Ram Charan, Shruti Hassan and Amy Jackson alongside him. Allu Arjun and Kajal Agarwal will also be seen in cameo roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X