గోవా తీరంలో అల్లు అర్జున్ ఎంజాయ్
అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాక జరుపుకుంటున్న మొదటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇదే. అందుకే గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆయన నిర్ణయించుకొన్నారు. తన భార్య స్నేహతో ఆయన గోవాలో ఉన్నారిప్పుడు. డిసెంబరు 31 వేడుక కూడా అక్కడే జరుపుకొన్నారు. తిరిగి వచ్చాక త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.నవంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. దీనికోసం ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది. కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్లో డెరైక్ట్గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్లో పెట్టారు.
అలాగే రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని చెప్తున్నారు.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది.మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











