డైలామాలో చరణ్, అర్జున్ మల్టీస్టారర్?..కన్ఫమ్ చేసిన చరణ్..?
రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి తొలిసారిగా ఓ సినిమాలో నటిస్తున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలు పెద్ద సంచలనాన్ని రేపాయి. దీనికి 'బృందావనం' చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. వంశీతో తాను ఓ చిత్రం చేస్తున్నట్టు, దీనిని గంటా శ్రీనివాస రావు, తన బావ విష్ణు కలిసి నిర్మిస్తున్నట్టూ చరణ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అయితే, ఇందులో అల్లు అర్జున్ నటించే ప్రస్తావన మాత్రం చరణ్ తీసుకురాలేదు.
ఇదే విషయం వంశీతో ప్రస్తావిస్తే, ఆ సినిమా గురించి తానేమీ మాట్లాడననీ, చరణ్ చెబుతాడనీ తప్పించుకుంటున్నాడు. అంటే, బన్నీ నటించే విషయాన్ని కావాలనే వీరు దాస్తున్నారా? లేక, ఇందులో చరణ్ ఒక్కడే నటిస్తున్నాడా? అన్న అనుమానం అందరికీ కలిగింది. ట్విట్టెర్ లో అభిమానులు ఈ విషయంపై అడుగుతున్నప్పటికీ చరణ్ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించటం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని ఓ అభిమాని ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు చరణ్...


Click it and Unblock the Notifications











