twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఇప్పుడు..ఎక్కడ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్ రీసెంట్ గా తన భార్య స్నేహతో కలిసి స్పెయిన్ కి టూర్ వేసారు. జూలాయి సినిమా విజయంతో ఆ ఉత్సాహంతో ఈ షార్ట్ వెకేషన్ కి అల్లు అర్జున్ వెళ్లి రీసెంట్ గా ఇండియాకు తిరిగి వచ్చారు. తన కెరీర్ లో జులాయి చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవటంతో చాలా ఉషారుగా ఉన్నారు అల్లు అర్జున్. కేవలం అమెరికాలోనే నాలుగున్న కోట్లు రూపాయలు వసూలు చేయటం బన్ని కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే కేరళలో సైతం ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియా వచ్చిన వెంటనే తన తదుపరి రెండు చిత్రాలకు అల్లు అర్జున్ ప్రిపేరవుతున్నారు.

    ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా కమిటయ్యారు .'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది. ఇక తాజా సినిమా విషయానికొస్తే సెప్టెంబర్ 20న ముహూర్తం జరుగుతుందని, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిసింది.

    అలాగే అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనుంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ "అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వక్కంతం వంశీ మంచి కథతో ముందుకొచ్చారు.

    బన్నీ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ అంటే సినిమా ఎంత స్టైలిష్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారిద్దరి శైలి తెరపై ఆవిష్కృతమవుతుంది. ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తాం. నవంబర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని ప్రారంభిస్తాం. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బన్నీ చిత్రానికి థమన్ స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారి'' అని అన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, సంగీతం: థమన్, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు.

    English summary
    Allu Arjun has come back to India after a short vacation in Spain. Recently, he took some time out and flew to Spain, along with his wife Sneha, after completing all the promotional activity for Julayi. Allu Arjun has signed two new films including Puri Jagannadh's Iddaru Ammayilatho which will be launched on September 20. Ganesh Babu is going to produce this film. Another film, which was recently announced, is going to be directed by Surender Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X