Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అవే నన్ను హీరోని చేసాయి: అల్లు అర్జున్
ప్రస్తుతం బన్నీ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారు అల్లు అర్జున్. ఆ తరవాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. ఆ వరుసలోనే స్టూడియోగ్రీన్ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇది తెలుగుతోపాటు తమిళంలోనూ రూపొందుతుందని తెలిసింది.
ఈ మేరకు దర్శకుడు రాజేష్ తమిళ మీడియాతో మాట్లాడుతూ..నేను అల్లు అర్జున్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాను. త్వరలోనే ఓ షేప్ తీసుకున్న తర్వాత వినిపిస్తాను. నా సినిమాలు అల్లు అర్జున్ చూసి చాలా ఎంజాయ్ చేసానని చెప్పారు. నా కథ అల్లు అర్జున్ కి నచ్చుతుందనే భావిస్తున్నాను అన్నారు.
ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి నిర్మాణం కానుంది. గీతా అర్డ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. ఇక రాజేష్ గతంలో డైరక్ట్ చేసిన ఎస్.ఎమ్ ఎస్ చిత్రం తెలుగులో మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో రీమేక్ చేసారు. అలాగే బాస్ ఎనగర్ బాస్కరన్ చిత్రం నేనే అంబాని టైటిల్ తో ఇక్కడ డబ్బింగ్ అయ్యింది. నయనతార,ఆర్య కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నమోదైంది.