Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాకింగ్: బన్నీ-త్రివిక్రమ్ సినిమాపై కోట్లు...
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో బడ్జెట్ రేంజి రోజు రోజుకు పెరిగి పోతోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే నిర్మాతలు మూటల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. హిట్టయితే జాక్ పాట్...ఫట్టయితే భారీ నష్టాలు. ఒక రకంగా నిర్మాతలు స్టార్స్ ను నమ్మి బెట్టింగ్ కాయడం లాంటిదే. ఇపుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా విషయంలోనూ ఇలానే జరుగుతోందని అంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో సమంత, నిత్యా మీనన్, ఆదా శర్మ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వీరి రెమ్యూనేషన్ దాదాపు 25 నుండి 30 కోట్లు ఉంటుందని అంచనా. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మో 20 నుండి 25 కోట్ల మధ్యన ఉంటుందని అంచనా. మొత్తం కలిపితే బడ్జెట్ 50 కోట్ల పైమాటే. ఇంత బడ్జెట్ పెట్టడం పరిశ్రమ వర్గాలను షాక్కు గురి చేస్తోంది.
ఇందులో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్గా సరికొత్త పాత్రలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరింత స్టైలిష్గా వుంటారని, పంచ్డైలాగ్లు అలరిస్తాయని అంటున్నారు.
సమంతా, ఆదాశర్మ, నిత్యామీనన్ కథానాయికలగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.