Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కొత్త చిత్రాన్ని అడ్డుకొన్న తెలంగాణ వాదులు..!
బద్రీనాథ్"గా వెరయిటీ పాత్రతో మెప్పించిన అల్లు అర్జున్... మళ్లీ తన పంథాలోకొచ్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వినోదాత్మకంగా సాగే ఓ యాక్షన్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మొన్నామద్యన హైదరాబాద్లో మొదలైన విషయం విధితమే.
కాగా కొంత కాలం గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ ఈ రోజు తిరిగి షూటింగులో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నాడు. అయితే, ఆ ఉత్సాహం ఎంతో సేపు నిలవలేదు. తెలంగాణావాదులు షూటింగును అడ్డుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఇలియానా జంటగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగు ఈ రోజు ఉదయం హైదరాబాదు, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్, మలేసియా టౌన్ షిప్ సమీపంలోని ఐకాన్ ఆసుపత్రి వద్ద ప్రారంభమైంది. అంతలోనే తెలంగాణావాదులు దూసుకువచ్చి, తెలంగాణా నినాదాలు చేయాలంటూ యూనిట్ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ గందరగోళ పరిస్థితులలో షూటింగును క్యాన్సిల్ చేసుకుని యూనిట్ సబ్యులు వెళ్ళిపోయారు.