Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కన్నడ సినిమా చూసిన అల్లు అర్జున్...రీమేక్ కోసమా?
బెంగుళూరు: తాజాగా అల్లు అర్జున్ కన్నడంలో విజయవంతమైన రంగి తరంగ చిత్రం నిన్న ఆగస్టు 2న చూసారు. నమ్మ బెంగుళూరు ధియోటర్ లో ఆయన సినిమా చూసారు. క్రింద ఆ ఫొటో ఉంది చూడండి. ఇక అల్లు అర్జున్ అంత ఇంట్రస్ట్ గా థియోటర్ కు వచ్చి మరీ ఈ చిత్రం చూడటంతో ఈ చిత్రం రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారా అనే సందేహాలు టాలీవుడ్ లో కలుగుతున్నాయి. ఇంతకీ ఇదో ధ్రిల్లర్. బాహుబలిని తట్టుకుని ఈ చిత్రం అక్కడ ఆడుతోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం రీసెంట్ గానే ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ ఎంపిక పూర్తైందని తెలుస్తోంది. ఆ పాత్రలో కనిపించేది మరెవరో కాదు...గతంలో ఒక విచిత్రం, గుండెల్లో గోదారి చిత్రాల్లో హీరోగా కనిపించిన ఆది పినిశెట్టి అని సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి తెలుగులో బిజీ అవుతానని భావిస్తున్నట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫైట్ షూటింగ్ తో ఈ నెల 19నుండి ప్రారంభించారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
తొలి నుంచి తనదైన శైలిలో మాస్ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్ లవ్ స్టోరీ మిక్స్ అయిన కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తాం.
బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్లో థమన్ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.
అల్లు
అర్జున్
హీరోగా
బోయపాటి
శ్రీను
దర్శకత్వంలో
గీతా
ఆర్ట్స్
సంస్థలో
ఓ
సినిమా
రూపొందనుంది.థమన్.ఎస్.ఎస్.
ఈ
చిత్రానికి
సంగీతాన్ని
అందిస్తున్నారు.
ఈ
సినిమాకి
సంగీతం:
థమన్.ఎస్.ఎస్.,
మాటలు:
ఎం.రత్నం,
కథ,
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం:
బోయపాటి
శీను.